
సిటీలో ఆదివారం చాంపియన్షిప్ విన్నింగ్ జోష్ కనిపించింది. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ లో టీమిండియా ఘన విజయం సాధించడంతో ఫ్యాన్స్ సంబురాలు చేసుకున్నారు. యువత వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి విజయోత్సవాలు చేసుకోవడంతో అర్ధరాత్రి అయినా చోట్ల ట్రాఫిక్ జామయ్యింది.
అంతకుముందు మధ్యాహ్నం మ్యాచ్ చూసేందుకు మెయిన్ సెంటర్లలో బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. థియేటర్లలో స్పెషల్ స్క్రీనింగ్ వేయగా ఫ్యాన్స్ క్యూ కట్టారు. ఫాంహౌస్లు, రిసార్టుల్లో కూడా మ్యాచ్ చూస్తూ చిల్ అయ్యారు. ఇండ్లల్లో అభిమానులు టీవీలకు అతుక్కుపోయారు. - వెలుగు నెట్వర్క్