
న్యూజీలాండ్: భారత మహిళల క్రికెట్ జట్టు దారుణమైన ప్రదర్శన చేస్తోంది. న్యూజిలాండ్ తో జరుగుతన్న ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా జరిగిన మూడో మ్యాచ్ లోనూ భారత మహిళల క్రికెట్ జట్టు ఓటమి పాలైంది. ఈ సిరీస్ లో టీమిండియా ఇప్పటికే రెండు మ్యాచులు కోల్పోయింది. భారత్ ఓడిపోవటంతో న్యూజిలాండ్ మహిళ జట్టు 3-0 తేడాతో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. కాగా నేటి మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 279 పరుగులకే ఆలౌట్ అయింది.
అనంతరం 280 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 49.1 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేరుకుంది. కాగా టీమిండియా ఓపెనర్లు.. మేఘన (61), షఫాలీ వర్మ (51) పరుగులు చేసి శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు తొలి వికెటుకు 100 పరుగులు జోడించారు. ఓపనర్లు ఔటయ్యాకా క్రీజ్ లోకి వచ్చిన వారంతా చేతులెత్తేశారు. ఒక్క దీప్తి శర్మ ( మాత్రమే నిలకడగా ఆడి 69 పరుగులు చేసింది. ఇక బౌలింగ్ విషయానికొస్తే జూలన్ గో స్వామి (3 వికెట్లు), దీప్తి శర్మ (1 వికెట్ ) తప్ప మిగతా బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. మొదటి మూడు ఓవర్లలోపే న్యూజీలాండ్ రెండు వికెట్లు కోల్పొయింది. అయితే తర్వాత వచ్చిన అమేలియా కెర్ (67), అమీ సాటర్త్ వైట్ (59), లారెన్ డౌన్ (64) నిలకడగా రాణించటంతో న్యూజిలాండ్ విజయం సాధించింది. లారెన్ డౌన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
మరిన్ని వార్తల కోసం: