పత్తి, మిర్చి పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

 పత్తి, మిర్చి పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

కారేపల్లి, వెలుగు : కారేపల్లి మండలంలోని పత్తి, మిర్చి పంటలను వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం శుక్రవారం పరిశీలించారు. వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు ఫణిశ్రీ, రవికుమార్, ఏడీఏ కరుణశ్రీ, ఏవో అశోక్ కుమార్ బృందం గేట్ రేలకాయలపల్లి ప్రాంతంలో పంటలను పరిశీలించారు. పత్తి, మిరప రైతులు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు వివరించారు.