శ్రీరాంపూర్ ​ఏరియాలోని గనులని సందర్శించిన కోల్​ కంట్రోల్ ​బృందం

శ్రీరాంపూర్ ​ఏరియాలోని గనులని సందర్శించిన కోల్​ కంట్రోల్ ​బృందం

నస్పూర్, వెలుగు: శ్రీరాంపూర్​ఏరియాలోని బొగ్గు గనులను నేషనల్ కోల్​ కంట్రోల్​ఉన్నతాధికారుల బృందం బుధవారం సందర్శించింది. నాగ్​పూర్ రీజియన్ నేషనల్​ కోల్​ కంట్రోల్​(మహారాష్ట్ర) ఓఎస్​డీ సందీప్​పరాంజపే, కొత్తగూడెం రీజియన్​ ఓఎస్​డీ డీవీ సుబ్రమణ్యం, ఇతర ఉన్నతాధికారులు ఏరియాలో మూసివేసిన ఆర్కే-8 గనిని పరిశీలించారు. గని మొయిన్ వే, ఎయిర్​ షాప్ట్​ పరిసరాలు, సేఫ్టీ ఫెన్సింగ్​ను తనిఖీ చేశారు.

పర్యావరణ, భూసారం పరిరక్షణకు చేపట్టిన చర్యలు, నీటి నిర్వహణ తీరును  శ్రీరాంపూర్​ఏరియా సింగరేణి జీఎం ఎం.శ్రీనివాస్​ను అడిగితెలుసుకున్నారు. ఏరియా ఏస్వోటుజీఎం సత్యనారాయణ, ఆర్కే7 గ్రూప్​ఏజెంట్​రాజేందర్, కార్పొరేట్​ఆఫీసర్లు తిరుపతి, జి.బాబ్జి, ఎం.శేఖర్, ఆర్కే7 మైన్​ మేనేజర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు