ఏం జరిగింది : తిరుపతిలో దిగకుండానే.. తిరిగి హైదరాబాద్ వచ్చిన విమానం

ఏం జరిగింది : తిరుపతిలో దిగకుండానే.. తిరిగి హైదరాబాద్ వచ్చిన విమానం

హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.  ఒంటి మిట్ట దగ్గర వరకు  వెళ్లిన తర్వాత సాంకేతిక లోపం కారణంగా మళ్లీ  శంషాబాద్ ఎయిర్ పోర్టులో సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. హైదరాబాద్ నుండి ఉదయం 6: 35గంటలకు బయలుదేరి 7: 30గంటలకు తిరుపతి చేరుకోవాల్సి ఉంది.

సాంకేతిక లోపం వల్ల తిరిగి 8: 30గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు. విమానంలో 66 మంది ఉన్నారు. సాంకేతికలోపం తలెత్తినా పరమాదమేమి జరగకపోవటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.