
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్, జూనియర్ ట్రైనీ ఆఫీసర్, సర్వేయర్ పోస్టుల భర్తీకి ఉత్తరాఖండ్లోని తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు మార్చి 14వ తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
జూనియర్ ట్రైనీ ఆఫీసర్ పోస్టులు: 07
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి హోటల్మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్లో డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా జూనియర్ మైన్ సర్వేయర్, జూనియర్ ఓవర్ మ్యాన్
పోస్టులు: 08
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి మైన్ సర్వే, మైన్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్లో డిప్లొమాతోపాటు పని అనుభవంఉండాలి.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
పోస్టులు 129: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, జియోలజీ, జియోటెక్నికల్, ఎన్విరాన్మెంట్, మైనింగ్, హ్యూమన్ రీసోర్స్, ఫైనాన్స్ విభాగంలో ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీఏ, సీఏ, సీఎంఏలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
Also Read:-రైతులకు శుభవార్త.. ప్రధాన మంత్రి ధన ధాన్య కృషి యోజన స్కీమ్ గురించి తెలుసా..?