పెంబి మండలంలో మోడల్​ లైబ్రరీల ప్రారంభం

 పెంబి మండలంలో మోడల్​ లైబ్రరీల ప్రారంభం

పెంబి/కుంటాల, వెలుగు: రూమ్ టూ రీడ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో పలు చోట్ల గురువారం మోడల్  లైబ్రరీలను ప్రారంభించారు. పెంబి మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్​లో ఏర్పాటుచేసిన లైబ్రరీని ఎంపీడీవో రమాకాంత్, తహసీల్దార్ లక్ష్మణ్ ప్రారంభించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యం మెరుగుపరుచుకునేందుకు ఈ లైబ్రరీ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

ఎంఈవో రాంచందర్, రూమ్ టూ రీడ్ సంస్థ బ్లాక్ కో ఆర్డినేటర్ రాజేందర్, స్కూల్​హెచ్​ఎం అన్వేషిత, ఎస్​ఐ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు లైబ్రరీని సద్విని యోగం చేసుకొని పఠనా నైపుణ్యం పెంచుకోవాలని కుంటాల ఎంఈవో ముత్యం అన్నారు. రూమ్ టూ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో మండలం లోని లింబా కే జడ్పీ హైస్కూల్​లో ఏర్పాటు చేసిన మోడల్ లైబ్రరీని ఆయన ప్రారంభించారు. లైబ్రరీ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. హెచ్​ఎం రవీందర్, స్థానిక నాయకులు, పోషకులు, విద్యార్థులు పాల్గొన్నారు.