- హంగ్కూ అవకాశం లేకపోలేదన్న ఎగ్జిట్ పోల్స్
- ముగిసిన ఎన్నికల పోరు, 10న రిజల్ట్
బీహార్లో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మహాకూటమికే అధికారం దక్కనుందని అంచనా వేశాయి. అయితే ఎన్డీయే, మహాకూటములు గెల్చుకునే సీట్ల మధ్య తేడా చాలా తక్కువని, కాస్త అటూఇటైతే హంగ్ ఏర్పడే అవకాశమూ లేకపోలేదని తేల్చిచెబుతున్నాయి. మూడు దశల్లో సాగిన పోలింగ్లో తేజస్వీ యాదవ్కే యువత జై కొట్టిందని పేర్కొన్నాయి.
పాట్నా: బీహార్లో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మహాకూటమికే అధికారం దక్కనుందని అంచనా వేశాయి. ఈ ఎన్నికల పోరులో ఎన్డీఏతో జతకట్టిన నితీశ్ కుమార్ వెనకబడ్డారని చెప్పాయి. అయితే, రెండు కూటములు గెల్చుకునే సీట్ల మధ్య తేడా చాలా తక్కువని, కాస్త అటూఇటైతే హంగ్ ఏర్పడే అవకాశమూ లేకపోలేదని తేల్చిచెబుతున్నాయి. మూడు దశల్లో సాగిన పోలింగ్లో తేజస్వీ యాదవ్కే యువత జై కొట్టిందని పేర్కొన్నాయి. ఈమేరకు శనివారం సాయంత్రం మూడో దశ పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. టైమ్స్ నౌ–సీ ఓటర్, పీపుల్స్ పల్స్, రిపబ్లిక్ జన్కీ బాత్, ఏబీపీ న్యూస్ తదితర సంస్థలు తమ సర్వే వివరాలను వెల్లడించాయి. దాదాపుగా అన్ని సంస్థలూ మహాకూటమికే కొంత మొగ్గు ఉందని తేల్చాయి. ఎల్జేపీ గెల్చుకునే సీట్ల సంఖ్య రెండంకెలు దాటే పరిస్థితి లేదని దాదాపుగా అన్ని సర్వేల్లోనూ తేలింది. సీఎంగా నితీశ్ కుమార్ కన్నా తేజస్వీ యాదవ్కే ప్రజల మద్దతు ఎక్కువని తెలిపాయి. సీఎంగా ఎవరుండాలనే ప్రశ్నకు తేజస్వీకి 44%, నితీశ్కు 35% మంది ఓటేశారని ఇండియా టుడే సర్వే వెల్లడించింది.
మ్యాజిక్ మార్కు దాటేదెవరు?
రాష్ట్రంలోని 243అసెంబ్లీ సీట్లకు 3 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో జేడీయూ, బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ మరోసారి అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉంది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో ఆర్జేడీ ఏర్పాటు చేసిన మహాకూటమి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కృషి చేస్తోంది. మరోవైపు, ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ఒంటరిగా బరిలోకి దిగారు. 243 అసెంబ్లీ సీట్లున్న బీహార్లో 122 సీట్లు గెల్చుకున్న పార్టీ(కూటమి) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలో వరుసగా నాలుగో సారి కూడా నితీశ్ కుమార్ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో తేజస్వీ యాదవ్ సీఎం కుర్చీలో కూర్చుంటారా.. రెండు కూటములకూ స్పష్టమైన మెజారిటీ రాకుండా హంగ్ ఏర్పడితే చిరాగ్ చక్రం తిప్పే పరిస్థితి వస్తుందా.. అనేది ఈ నెల 10 న తేలనుంది.
మ్యాజిక్ మార్కు దాటేదెవరు?
రాష్ట్రంలోని 243అసెంబ్లీ సీట్లకు 3 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో జేడీయూ, బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ మరోసారి అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉంది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో ఆర్జేడీ ఏర్పాటు చేసిన మహాకూటమి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కృషి చేస్తోంది. మరోవైపు, ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ఒంటరిగా బరిలోకి దిగారు. 243 అసెంబ్లీ సీట్లున్న బీహార్లో 122 సీట్లు గెల్చుకున్న పార్టీ(కూటమి) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలో వరుసగా నాలుగో సారి కూడా నితీశ్ కుమార్ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో తేజస్వీ యాదవ్ సీఎం కుర్చీలో కూర్చుంటారా.. రెండు కూటములకూ స్పష్టమైన మెజారిటీ రాకుండా హంగ్ ఏర్పడితే చిరాగ్ చక్రం తిప్పే పరిస్థితి వస్తుందా.. అనేది ఈ నెల 10 న తేలనుంది.