భూ భారతి రూల్స్పై కసరత్తు.. చట్టం వచ్చి దాదాపు 2 నెలలు కావస్తున్న క్రమంలో..

భూ భారతి రూల్స్పై కసరత్తు.. చట్టం వచ్చి దాదాపు 2 నెలలు కావస్తున్న క్రమంలో..
  • ఎంసీహెచ్​ఆర్డీలో నేటి నుంచి రెండు రోజులు వర్క్ షాప్
  • మాడ్యూల్స్​తగ్గింపు.. సర్వే మ్యాప్​రూపకల్పనపై సమాలోచనలు
  • కిందిస్థాయిలోనే అప్లికేషన్లు పరిష్కరించేలా రూల్స్
  • ట్రిబ్యునల్స్లో ఎవరుండాలనేది తేల్చనున్న అధికారులు
  • అప్పీళ్ల వ్యవస్థ, సాదా బైనామాల పరిష్కారం, పార్ట్​బీ భూములపై క్లారిటీ

హైదరాబాద్, వెలుగు: భూ భారతి చట్టానికి రూల్స్​ఖరారు చేసే పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. చట్టం వచ్చి దాదాపు 2 నెలలు కావస్తున్న  నేపథ్యంలో వీటిని తీసుకువచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం హైదరాబాద్లోని ఎంసీహెచ్​ఆర్డీలో రెండు రోజులపాటు వర్క్​షాప్ నిర్వహించనున్నది. ఈ మంగళ, బుధ వారాల్లో భూ భారతి చట్టం అమలు చేసేందుకు ఎలాంటి రూల్స్ను తీసుకురావాలనే దానిపై ఉన్నతాధికారుల దగ్గర నుంచి.. కింది స్థాయిలో తహసీల్దార్ల దాకా ఎంపిక చేసిన వారితో సమావేశం నిర్వహించబోతున్నది.

ఇప్పటికే ప్రభుత్వం అనుకున్న కొన్ని రూల్స్​, గతంలో అమలైనవి, చట్టంలో పేర్కొన్న అంశాలకు తగ్గట్టుగా కొత్తవి ప్రతిపాదించనున్నది. వాటి అమలులో ఏమైనా ఇబ్బందులు వస్తాయా? ఏ రకంగా ఉంటే సమస్యలు రాకుండా ఉంటాయి? అనే కోణంలో 2 రోజులు వర్క్​షాప్​ను నిర్వహిస్తున్నారు.

ఇందులో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్​సెక్రటరీ నవీన్​ మిట్టల్ తోపాటు నాలుగైదు జిల్లాల కలెక్టర్లు, ఆయా జిల్లాల అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లతో పాటు భూ చట్టాల నిపుణులు భూమి సునీల్, సీసీఎల్​ఏ​ అసిస్టెంట్ సెక్రటరీ లచ్చిరెడ్డి తదిరులు పాల్గొంటారని తెలుస్తున్నది. ప్రధానంగా మాడ్యూల్స్​ను ఎలా తగ్గించాలి? కొత్త చట్టంలో పేర్కొన్న సర్వే మ్యాప్​ను ఎలా సిద్ధం చేసుకోవాలి ? అనేదానిపై కసరత్తు చేయనున్నారు. రైతులకు ఈజీగా ఉండి.. కింది స్థాయిలోనే అప్లికేషన్లు పరిష్కరించే దిశగా రూల్స్​ను రెడీ చేయనున్నారు.

భూ భారతి చట్టంలో ప్రధానంగా అప్పీళ్ల వ్యవస్థ, ట్రిబ్యునళ్లు తెచ్చారు. దీంతో ట్రిబ్యునల్స్​లో ఎవరు ఉండాలి ? ఏ సమస్యకు ఎన్ని రోజుల్లో పరిష్కారం చూపించాలి? అనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అప్పీళ్ల వ్యవస్థలోనూ ఎంత సమయం పెట్టాలనే దానిపై రూల్స్​లో క్లారిటీ ఇవ్వనున్నారు. వీటితోపాటు సాదా బైనామాల పరిష్కారం, పార్ట్​ బీ భూముల విషయంలో తీసుకోవాల్సిన దానిపై రూల్స్లో స్పష్టత ఇవ్వనున్నారు.