హెచ్​సీయూ ల్యాండ్ వివరాలను సేకరించిన బీజేపీ ఎంపీలు

హెచ్​సీయూ ల్యాండ్  వివరాలను సేకరించిన బీజేపీ ఎంపీలు
  • లీగల్ డాక్యుమెంట్లు ఏమున్నయ్?..  వర్సిటీ వీసీ నుంచి వివరాలు సేకరించిన బీజేపీ ఎంపీలు 
  • హెచ్​సీయూపై కేటీఆర్​కు అంత ప్రేమ ఉంటే.. టీఎన్జీవోలకు అక్కడ భూమెట్ల ఇచ్చిన్రు?: కొండా విశ్వేశ్వర్​రెడ్డి
  • పవర్​లో ఉన్నప్పుడు ల్యాండ్స్​ను వర్సిటీకి ఎందుకు రాసియ్యలే అని నిలదీత
  • సుద్దపూస మాటలు మానుకోవాలని సూచన
  • కంచ గచ్చిబౌలి ఇష్యూలో ఉన్న ఎంపీ ఎవరో కేటీఆరే చెప్పాలి: రఘునందన్​రావు
  • వర్సిటీ భూముల చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టాలని ప్రభుత్వానికి డిమాండ్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై వర్సిటీ వీసీ నుంచి బీజేపీ ఎంపీలు వివరాలు సేకరించారు. బుధవారం వర్సిటీ వీసీ జగదీశ్వర్ రావు, రిజిస్ట్రార్ దివేశ్ నిగమ్ తో ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్​రావు, ఈటల రాజేందర్ తదితరులు సమావేశమయ్యారు. కొండా విశ్వేశ్వర్​రెడ్డి నివాసంలో భేటీ జరిగింది. అప్పట్లో కాంగ్రెస్​ ప్రభుత్వం హెచ్​సీయూకు ఎంత భూమి కేటాయించింది? ఆ భూమి వర్సిటీ పేరుతో ట్రాన్స్​ఫర్ ​అయిందా? ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల్లో ఎవరి పేరుతో ఉంది? అందులో ఎంత కబ్జాకు గురైంది? సర్వే చేసే అవకాశాలున్నయా? లీగల్​ డాక్యుమెంట్లు ఏమున్నయ్​? అని వీసీని ఎంపీలు అడిగి తెలుసుకున్నారు. వర్సిటీ అధికారుల వద్ద ఉన్న లీగల్ డాక్యుమెంట్లను పరిశీలించారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. 

134 ఎకరాలను టీఎన్జీవోస్​కు బీఆర్ఎస్​ ఇచ్చింది: కొండా

హెచ్​సీయూకు 1974లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే భూములు ఇచ్చిందని ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి మీడి యాతో అన్నారు. ఆ భూముల్లో కొంత భూమిని తిరి గి తీసుకోవడంతో పాటు గచ్చిబౌలి స్టేడియానికి, ఎంఆర్​ఓ ఆఫీస్​కు, నవోదయ స్కూల్​కు, మున్సిపల్ ఆఫీసుకు  కేటాయించారని కొంత భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోయిందని తెలిపారు. ఈ నేపథ్యం లో వర్సిటికీ ఎన్ని ఎకరాలు ఉందనే వివరాలను తీసుకున్నట్టు ఆయన చెప్పారు. ‘‘సెంట్రల్ వర్సిటీ భూము లను తామే కాపాడుతున్నట్టుగా కేటీఆర్​ సుద్దపూస మాటలు మాట్లాడుతున్నడు. కానీ, వర్సిటీ భూముల్లోంచి 134 ఎకరాలను కేసీఆర్ టీఎన్​జీవోలకు ఇచ్చింది నిజం కాదా? నిజంగా బీఆర్ఎస్ కు వర్సిటీ పై ప్రేమ ఉంటే.. ఆ రోజే(బీఆర్​ఎస్​ అధికారంలో ఉన్నప్పుడు) ఆ భూములను వర్సిటీకి రాసిచ్చేవారు. టీఎన్జీఓల కోసం భూమి ఇచ్చి అక్కడ రోడ్డు వేస్తే.. దానిపై వర్సి టీ కోర్టుకు పోయింది” అని ఆయన తెలిపారు. 

ఈ ఎంపీ ఎవరో కేటీఆర్​ చెప్పాలి: రఘునందన్ 

2012లో అప్పటి రంగారెడ్డి కలెక్టర్ 2,185 ఎకరా లు హెచ్​సీయూకు చెందినదేనంటూ సీసీఎల్​ఏకు లేఖ రాశారని ఎంపీ రఘునందన్​ రావు పేర్కొన్నారు. ఈ భూమిపై  సుప్రీంకోర్టులో రేవంత్​ కొట్లడింది ఎప్పుడో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హెచ్​ సీయూకు 2,185 ఎకరాల భూములు ఇస్తే సరిపోతుందని తెలిపారు. వివాదాస్పదంగా ఉన్న 400 ఎకరాలను పక్కన పెట్టి.. 1,785 ఎకరాల భూమికి గత పదేండ్లలో ఎందుకు ప్రహరీ కట్టలేదో కేటీఆర్​ సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. హెచ్​సీ యూ ల్యాండ్ కేసులో బీజేపీ ఎంపీ ఉన్నారని కేటీఆర్​ చేసిన కామెంట్లపై మీడియా ప్రశ్నించగా.. ‘‘ఆ ఎంపీ ఎవరో చెప్తే పార్టీ తరఫున సమాధానమిస్తం” అని రఘునందన్​ అన్నారు. వర్సిటీ అంశాన్ని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు.