తెలంగాణ కేబినెట్ మీటింగ్ అక్టోబర్ ​26కు వాయిదా

తెలంగాణ కేబినెట్ మీటింగ్ అక్టోబర్  ​26కు వాయిదా

హైదరాబాద్, వెలుగు: కేబినెట్​ మీటింగ్​వాయిదా పడింది. తొలుత ఈ నెల 23న సమావేశం​ఉంటుందని ప్రకటించగా.. దానిని వాయిదా వేశారు. శనివారం సీఎస్​ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే శనివారం సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియెట్​లో కేబినెట్​ మీటింగ్​ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

ఇద్దరు మంత్రులు 23న అందుబాటులో లేకపోవడంతో సమావేశం వాయిదా పడినట్టు తెలుస్తున్నది. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, పొన్నం ప్రభాకర్​..  సియోల్​ నది శుద్ధి, సుందరీకరణ తీరును స్టడీ చేసేందుకు సౌత్​ కొరియాకు వెళ్లారు. ఈ నెల 25న వారు తిరిగి రాష్ట్రానికి రానున్నారు. దీంతో భేటీ వాయిదా వేసినట్టు తెలిసింది.