
తెలంగాణ సీఎం కేసీఆర్ రెండో విడుత ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 2023 నవంబర్ 13 నుంచి 28 వరకు అంటే 16 రోజల్లో సీఎం 54 సభల్లో పాల్గొంటారు. నవంబర్ 13 న దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేటలలో జరిగే BRS ప్రజా ఆశీర్వాద సభలల్లో పాల్గొనున్నారు కేసీఆర్. ఇప్పటికే సభకు సంబంధించిన ఏర్పాట్లను అక్కడి లీడర్లు పూర్తి చేశారు. వీటిలో నవంబర్ 25న హైదరాబాద్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. నవంబర్ 28న గజ్వేల్ సభతో ప్రచారం ముగించనున్నారు. ఒక్కొక్క రోజున దాదాపుగా మూడు సభల్లో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు.
- నవంబర్ 13న దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేట్.
- నవంబర్ 14న పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నం.
- నవంబర్ 15న బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్.
- నవంబర్ 16న ఆదిలాబాద్, బోథ్, నిజామాబాద్ రూరల్, నర్సాపూర్.
- నవంబర్ 17న కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, పరకాల.
- నవంబర్ 18న చేర్యాల.
- నవంబర్ 19న అలంపూర్, కొల్లాపూర్, నాగర్కర్నూల్, కల్వకుర్తి.
- నవంబర్ 20. మానకొండూరు, స్టేషన్ ఘన్పూర్, నకిరేకల్, నల్గొండ.
- నవంబర్ 21. మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేట.
- నవంబర్ 22న తాండూర్, కొడంగల్, మహబూబ్నగర్, పరిగి.
- నవంబర్ 23న మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్చెరు.
- నవంబర్ 24న మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి,
- నవంబర్ 25న హైదరాబాద్లో భారాస ప్రజా ఆశీర్వాదసభ.
- నవంబర్ 26న ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక.
- నవంబర్ 27న షాద్నగర్, చేవెళ్ల, అందోల్, సంగారెడ్డి.
- నవంబర్ 28న వరంగల్ (ఈస్ట్, వెస్ట్), గజ్వేల్