డీఎస్సీ రిజల్ట్స్ సందర్భంగా సీఎం రేవంత్ మరో గుడ్ న్యూస్

డీఎస్సీ రిజల్ట్స్ సందర్భంగా సీఎం రేవంత్ మరో గుడ్ న్యూస్

హైదరాబాద్: డీఎస్సీ ఫలితాల విడుదల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మరో శుభవార్త చెప్పారు. త్వరలోనే గ్రూప్ 1 ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు. టీజీపీస్సీని ప్రక్షాళన చేస్తామని, త్వరలోనే గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించి తెలంగాణ పునర్నిర్మాణంలో వారిని కూడా భాగస్వామ్యం చేస్తామని సీఎం చెప్పారు. 

తీవ్రమైన నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం గ్రూప్ 1,2,3 పోస్టులను అంగడి సరుకుల్లా మార్చిందని విమర్శించారు. మొదటి ఏడాదిలోనే 65 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. 11062 టీచర్ ఉద్యోగాల భర్తీకి విశేష కృషి చేసిన అధికారులకు సీఎం అభినందనలు తెలిపారు.

డీఎస్సీ ఫలితాల విడుదల సందర్భంగా సీఎం రేవంత్ స్పీచ్ హైలైట్స్:

* 1:3 ప్రాతిపదికన ఫలితాలు విడుదల చేశాం
* దసరా లోపు ఫైనల్ నియామకాలు పూర్తి చేస్తాం..
* అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందిస్తాం..
* గత ప్రభుత్వం పదేళ్లలో ఒకే ఒకసారి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది... 
* పదేళ్లలో వాళ్లు చేపట్టిన ఉపాధ్యాయ నియామకాలు కేవలం 7,857 మాత్రమే.
* విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన గత ప్రభుత్వానికి లేదు.
* మేం అధికారంలోకి రాగానే ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ మొదలు పెట్టాం..

* విద్యకు మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది.
*  నిర్వహణ నుంచి నియామకాల వరకు 65 రోజుల్లో 11062 ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తున్నాం.
* ఇది విద్యపై మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది.
* తెలంగాణలో పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్నదే మా ఆకాంక్ష.
* అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే 30వేల ఉద్యోగాల నియామక పత్రాలు అందించాం.
* నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని టెట్ నిర్వహణ తర్వాతే డీఎస్సీ నిర్వహించాం.
* టీజీపీస్సీని ప్రక్షాళన చేశాం
* త్వరలోనే గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించి తెలంగాణ పునర్నిర్మాణంలో వారిని కూడా భాగస్వామ్యం చేస్తాం.
* మొదటి ఏడాదిలోనే 60వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తున్నాం.
* టీచర్ ఉద్యోగం కేవలం ఒక ఉద్యోగం కాదు.. అది భావోద్వేగం.

*  గత పదేళ్లలో విద్య నిర్లక్ష్యానికి గురైంది..
* మేం వచ్చాక విద్యా శాఖకు నిధుల కేటాయింపు పెంచాం..
* భవిష్యత్ లో మరిన్ని నిధులు కేటాయిస్తాం..
* గత ప్రభుత్వం స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించలేదు.
* అందుకే మా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తోంది..
* 100 నియోజకవర్గాల్లో 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం.
* పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిరలో ఏర్పాటు చేస్తున్నాం..
* గత ప్రభుత్వం టీచర్ల పదోన్నతులు, బదిలీలు చేపట్టలేదు..
* మా ప్రభుత్వం వివాదాలకు తావు లేకుండా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసింది.

* కొన్ని రాజకీయ పార్టీల మీడియాలు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులపై మాపై దుష్ప్రచారం చేస్తున్నాయి.
* పదేళ్లు ప్రభుత్వంలో ఉన్నవాళ్లు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు.
* అందుకే ఈ ఉపద్రవం వచ్చింది..
* వాటన్నింటిని పరిష్కరించుకుంటూ మేం ముందుకెళుతున్నాం.
 * విద్యపై పెట్టేది ఖర్చు కాదు.. పెట్టుబడి అని మేం భావిస్తున్నాం..
 * విద్యార్థుల సంఖ్యతో ప్రమేయం లేకుండా ప్రభుత్వ పాఠశాలలు నిర్వహిస్తాం.
* పేదలకు విద్య అందించడమే మా విధానం..