ఏడాదిలోనే హామీలు నెరవేర్చినం : సీఎం

ఏడాదిలోనే హామీలు నెరవేర్చినం : సీఎం
  •  రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం: సీఎం
  •  ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్​ జూమ్​ మీటింగ్​

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్  ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలోనే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చామని, దానితో పాటు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. 55 వేల ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్  యూనివర్సిటీ మంజూరు చేసి పనులు చేపట్టామన్నారు. 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్  కుమార్  గౌడ్ అధ్యక్షతన కాంగ్రెస్  పార్టీ జూమ్  సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్, ఏఐసీసీ ఇన్ చార్జి మీనాక్షి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర, సీతక్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్  నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.