గుడ్ న్యూస్: నిరుద్యోగ యువతకు రూ.3 లక్షలు..రాజీవ్ యువ వికాసం షురూ

గుడ్ న్యూస్:  నిరుద్యోగ యువతకు రూ.3 లక్షలు..రాజీవ్ యువ వికాసం షురూ

 తెలంగాణలో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభమయ్యింది. అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ యువతకు గరిష్టంగా రూ.3 లక్షల వరకు రుణాలివ్వనుంది ప్రభుత్వం. 

మార్చి 17 నుంచి  ఏప్రిల్ 5 వరకు  రాజీవ్ యవ వికాసం దరఖాస్తులు తీసుకోనుంది ప్రభుత్వం. ఏప్రిల్ 6 నుంచి మే31 వరకు దరఖాస్తులు పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయనుంది.  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున రుణాలు మంజూరు చేయనుంది ప్రభుత్వం. 5 లక్షల మంది యువతకు రూ 6 వేల కోట్లు ఇవ్వనుంది ప్రభుత్వం . 

ALSO READ | పార్టీలకతీతంగా ప్రధానిని కలుద్దాం.. బీసీ కోటా సాధిద్దాం : సీఎం రేవంత్ రెడ్డి

ఈ పథకం కింద ఎస్సీ,ఎస్టీ, బీసీలతో పాటు మైనార్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం గరిష్టంగా3లక్షల వరకు స్వయం ఉపాధి రుణాలు ఇవ్వనుంది.  కేటగిరి 1,2,3 వారీగా రుణాలివ్వనుంది ప్రభుత్వం. కేటగిరీ 1 కింద రూ. లక్ష వరకు లోన్ 80 రాయితీ ఉంటుంది. కేటగిరి 2 కింద రూ.2లక్షల వరకు రుణం 70 శాతం రాయితీ, కేటగిరి 3 కింద రూ. 3 లక్షల లోపు రుణం 60 శాతం రాయితీతో ఇవ్వనుంది.

జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో మండల స్థాయిలో అధికారుల కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసి ఫైనల్​ లిస్ట్​ను ​ప్రకటిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మందికి రాజీవ్​ యువ వికాసం పథకం అమలు చేస్తే.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 4,200 మందికి లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.