
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ నియోజకవర్గానికి సీఎం రేవంత్రెడ్డి రూ.50.82 కోట్ల నిధులు మంజూరు చేశారని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రద్దైన టీయూఎఫ్ఐడీసీ నిధులను మంజూరు చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి పొద్దుటూరు సుదర్శన్ రెడ్డిలను కలిసి మెమోరాండం ఇచ్చారు. నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల తరఫున వినయ్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.