నోబెల్‌‌‌‌‌‌‌‌ శాంతి శిఖరాగ్ర సమావేశానికి భట్టి

నోబెల్‌‌‌‌‌‌‌‌ శాంతి శిఖరాగ్ర సమావేశానికి భట్టి

మెక్సికోలో జరిగే మీటింగ్​కు రావాలని ఆహ్వానం

హైదరాబాద్, వెలుగు: మెక్సికో న్యూవోలియోన్‌‌‌‌‌‌‌‌లోని మోంటిగ్రో సిటీలో జరగనున్న 19వ ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు జరిగే ఈ సమావేశాలు ‘ప్రగతి కోసం శాంతి’అనే అజెండాతో నిర్వహిస్తున్నారు. ఈ 200వ వేడుకల్లో నోబెల్ గ్రహీతలు, ప్రపంచ శాంతి న్యాయవాదుల సామూహిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తమ ఆహ్వానంలో పేర్కొన్నారు. ఒత్తిడితో కూడిన ప్రపంచ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ, వ్యూహాలను ఈ శిఖరాగ్ర సమావేశంలో రూపొందిస్తామని పేర్కొన్నారు.