![విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలి : టి.లింగారెడ్డి](https://static.v6velugu.com/uploads/2025/02/telangana-education-protection-committee-state-leader-t-linga-reddy-demanded-20-percent-funds-for-the-education-sector_69jsEBtUe7.jpg)
హనుమకొండ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్లో విద్యా రంగానికి కనీసం 20శాతం నిధులు కేటాయించాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర నాయకుడు టి.లింగారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు హనుమకొండ కలెక్టరేట్ఎదుట శనివారం ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భగా టి.లింగారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విద్యారంగానికి కనీసం 15 శాతం నిధులు కేటాయిస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించిందని, ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్చేశారు. అనంతరం హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ నాయకులు డాక్టర్ ఎం.గంగాధర్, ఆర్.రమేశ్, మెట్టు రవీందర్, బి.నర్సింహారావు, కే.శ్రీనివాస్, జి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.