![స్పౌజ్ బదిలీలు చేపట్టాలి....తెలంగాణ సెంట్రల్ స్పౌజ్ ఫోరం](https://static.v6velugu.com/uploads/2025/02/telangana-employees-spouse--transfers-process-demand-by-telangana-centrel-spouse-forum_nEhcdzJSk2.jpg)
బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ స్పౌజ్ బదిలీల తరహాలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల స్పౌజ్ బదిలీలు చేపట్టాలని తెలంగాణ సెంట్రల్ స్పౌజ్ ఫోరం విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఆదివారం ఫోరం ప్రతినిధులు కుమారస్వామి నాందేవ్ జాదవ్, శైలజ మాట్లాడారు. జీవో 317తో నష్టపోయిన స్పౌజ్ ఉద్యోగులకు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో 243తో బదిలీలు చేపట్టారన్నారు. కానీ, భార్యాభర్తల్లో ఒకరు రాష్ట్ర , మరొకరు కేంద్ర ఉద్యోగులుగా పని చేస్తున్న వారిని పరిగణలోకి తీసుకోలేదన్నారు.