
- మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి వెంట మహారాష్ట్ర వెళ్లిన రైతన్నలు
నిజామాబాద్, వెలుగు : మహారాష్ట్ర సాంగ్లీలోని దత్త షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో అధిక దిగుబడి సాధిస్తున్న చెరుకు తోటల పరిశీలనకు ఆదివారం బోధన్ సెగ్మెంట్రైతులు తరలివెళ్లారు. మంత్రి శ్రీధర్బాబు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు నేతృత్వంలో రైతులు మహారాష్ర్టకు వెళ్లారు.
బోధన్లోని నిజాం చక్కెర ఫ్యాక్టరీ రీ–ఓపెన్ చేయడానికి రెడీ అయిన సర్కారు.. ఇక్కడి రైతులను చెరుకు సాగువైపు మళ్లించడానికి ప్రయత్నం చేస్తోంది. అధిక దిగుబడి సాధించే చెరుకు రకాలను సాగుచేయించడానికి రైతులను సిద్ధం చేస్తున్నారు. కేరళ స్టేట్కు చెందిన సీడ్ను సాంగ్లీ ఫ్యాక్టరీ పరిధిలో పండించి అక్కడి రైతులు ఎకరానికి 60 నుంచి 70 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. ఈ రకం చెరుకులో 12.5 శాతం రికవరీ వస్తోంది. శ్రీదత్త షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ గణపతిరావు పాటిల్ రైతులకు అవగాహన కల్పించారు.