![బాలామృతం నాణ్యత పెంచుతాం తెలంగాణ ఫుడ్స్ బృందం వెల్లడి](https://static.v6velugu.com/uploads/2023/07/Telangana-Foods-team-visited-Amul-Tech-Home-Ration-Factory-at-Anand,-Kaira-District_rOuQZEi1Cc.jpg)
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఫుడ్స్బృం దం రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా మొదటిరోజు శుక్రవారం కైరా జిల్లా ఆనంద్లోని అమూల్ టెక్ హోం రేషన్ ఫ్యాక్టరీని సందర్శించింది. ఈ సందర్భంగా ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ మాట్లాడుతూ..అమూల్ ఫ్యాక్టరీలో వినియోగిస్తున్న యంత్రాలు, టెక్నాలజీ అధునాతనమైనవని తెలిపారు. ఆసియాలోనే తెలంగాణ ఫుడ్స్కు అతిపెద్ద ప్లాంట్ఉందని.. దీని ద్వారా బాల మృతం ఉత్పత్తి చేస్తున్నామని వెల్లడించారు.
గుజరాత్లో వినియోగించే రోస్టర్లను మన రాష్ట్రంలో ప్రవేశపెడితే నాణ్యమైన పౌష్టికాహారం ఉత్పత్తి చేసి అందించవచ్చని వివరించారు. గుజరాత్లో బాల శక్తి పేరుతో అందిస్తున్న బాలామృతం తయారీకి రూ.75 ఖర్చు అవుతుంటే మనకు రూ.50 మాత్రమే ఖర్చవుతుందని రాజీవ్సాగర్ అన్నారు. ఆయన వెంట జీఎం విజయలక్ష్మి, ఏజీఎంలు శ్రీనివాస్నాయక్, ఎలమంద ఉన్నారు.