డిండి ప్రాజెక్టుకు రూ.6,190 కోట్లు

డిండి ప్రాజెక్టుకు రూ.6,190 కోట్లు
  • పాలమూరు ప్రాజెక్టులోని నార్లాపూర్​ రిజర్వాయర్​కు రూ.1,784 కోట్లు
  • పరిపాలనా అనుమతులు జారీ చేసిన సర్కారు

హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని డిండి లిఫ్ట్​ఇరిగేషన్​ స్కీమ్​ను సర్కారు ప్రాధాన్యంగా తీసుకున్నది. అందులో భాగంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని ఏదుల రిజర్వాయర్​ నుంచి నీటిని తరలించే కాంపొనెంట్లకు బుధవారం రూ.1,800 కోట్లు మంజూరు చేసిన సర్కారు.. తాజాగా డిండి నుంచి శివన్నగూడెం వరకు చేపట్టే పనుల కోసం రూ.6,190 కోట్లకు పరిపాలనా అనుమతులు జారీ చేసింది. 

ఈ మేరకు గురువారం ఇరిగేషన్​ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్​ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. 2015లో ఈ ప్రాజెక్టుకు తొలుత రూ.4,500 కోట్లతో అంచనాలను తయారు చేయగా.. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.6,190 కోట్లకు అనుమతులిచ్చారు. అయితే, ఇంతకుముందు శ్రీశైలం ఫోర్​ షోర్​ నుంచి నీటిని లిఫ్ట్​ చేసేలా డిండి ప్రాజెక్టును డిజైన్​ చేయగా.. ఇప్పుడు ఏదుల రిజర్వాయర్​ నుంచి నీటిని తరలించే ప్రాజెక్టుగా మాడిఫై చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

నార్లాపూర్​కు రూ.1,784 కోట్లు..

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులనూ సర్కార్​ స్పీడప్​ చేయనుంది. అందులో భాగంగా ప్రాజెక్టులోని నార్లాపూర్​ రిజర్వాయర్​కు రూ.1,784 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ప్రాజెక్టులోని ప్యాకేజీ​2లో భాగంగా చేపట్టిన ఈ రిజర్వాయర్​కు వేరియేషన్ ఎస్టిమేట్స్​కు ఆమోదం తెలిపింది. నాగర్​కర్నూల్​సీఈకి బాధ్యతలు అప్పగించింది. మరోవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్​రెడ్డి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీమ్​గా, సింగూరుకు మంత్రి దామోదర రాజనర్సింహ తండ్రి సిలారపు రాజనర్సింహ సింగూరు కెనాల్స్​గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.