ఎల్ఆర్ఎస్ కు మోక్షం..!

ఎల్ఆర్ఎస్ కు మోక్షం..!
  • నాన్​లేఅవుట్​ప్లాట్ల రెగ్యులేషన్​కు గవర్నమెంట్​ గ్రీన్​సిగ్నల్​
  • దరఖాస్తుదారుల నాలుగేండ్ల నిరీక్షణకు కదలిక    
  • ఉమ్మడి జిల్లాలో 1,91,499 ఎల్ఆర్ఎస్​ అప్లికేషన్​లు
  • రూ.19.14 కోట్ల ఫీజు రాబట్టుకొని గాలికొదిలేసిన గత బీఆర్ఎస్​ సర్కారు 
  • కాంగ్రెస్​ పాలనలో పరిష్కారం దిశగా అడుగులు​

ఉమ్మడి జిల్లాలో ఎల్ఆర్ఎస్​దరఖాస్తులకు త్వరలో మోక్షం లభించనుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయంతో నాలుగేండ్ల నుంచి పెండింగ్ లో ఉన్న అంశంపై కదలిక వచ్చింది. రెవెన్యూ ఆఫీసర్ల భాగస్వామ్యంతో స్పెషల్​ టీంల ఏర్పాటుకు యంత్రాంగం రెడీ అవుతోంది. వీలైనంత స్పీడ్​గా పల్లె, పట్టణాల్లోని నాన్​లేఅవుట్ ప్లాట్ల రెగ్యులరైజ్ చేయనుంది

నిజామాబాద్, వెలుగు : ఎల్ఆర్ఎస్​పేరుతో నాన్​లేఅవుట్ఇంటి స్థలాలు క్రమబద్ధీకరణ చేసుకోవాలని గత బీఆర్ఎస్​గవర్నమెంట్ ప్రజలకు సూచించగా, ఇందూర్​మున్సిపల్​కార్పొరేషన్​పరిధిలో 33,758  దరఖాస్తులు అందాయి. నుడా కింద ఉన్న 74 గ్రామ పంచాయతీల నుంచి 5,914 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. బోధన్, ఆర్మూర్, భీంగల్​మున్సిపాలిటీలు కలిపి మొత్తం 57,311 ఎల్ఆర్ఎస్​ దరఖాస్తులు వచ్చాయి. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి  మున్సిపాలిటీల నుంచి మరో 20,459 అర్జీలు పెట్టుకున్నారు. ఆన్​లైన్​ అప్లికేషన్​ ఫీజుగా కొందరి నుంచి రూ.వెయ్యి, మరికొందరి నుంచి రూ.10 వేలు అప్పటి సర్కారు తీసుకోగా, రూ.7.77 కోట్ల ఆదాయం సమకూరింది. 

ఫీజులు తీసుకొని పక్కన పెట్టేశారు..! 

ఈ దరఖాస్తులతో పాటు ఎల్ఆర్ఎస్​ను గ్రామ పంచాయతీలకు విస్తరించగా, నిజామాబాద్​ జిల్లాలోని 530 పంచాయతీల నుంచి 79,150, కామారెడ్డి జిల్లాలోని 526 జీపీల నుంచి 34,579 అప్లికేషన్లు ఆన్​లైన్​ ద్వారా వచ్చారు.. ఫీజు రూపంలో రూ.11.37 కోట్ల ఆదాయం​ లభించింది.  2020 ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31​ వరకు రెండు నెలల్లో ఉమ్మడి జిల్లా నుంచి 1,91,499 ఎల్ఆర్ఎస్​ అప్లికేషన్లతో అక్షరాల రూ.19.14 కోట్ల నగదు బీఆర్ఎస్​ గవర్నమెంట్​కు వెళ్లింది. ఆ తర్వాత ప్రభుత్వం ఈ సంగతి పట్టించుకోలేదు. లేఅవుట్​ కాని ఇంటి ప్లాట్స్​ కొని రెగ్యులైజేషన్​కోసం దరఖాస్తు చేసుకున్న వేలాది మంది పరిస్థితి అగమ్యంగా మారింది. దీని ప్రభావం రియల్​ ఎస్టేట్​ రంగంపైనా దీని ఎఫ్టెక్ట్​ పడింది. 

మొదటి నుంచి వ్యతిరేకించిన కాంగ్రెస్​ 

ఎల్ఆర్ఎస్​ను కాంగ్రెస్​పార్టీ మొదటి నుంచి వ్యతిరేకించింది. అధికారంలోకి వచ్చాక ఈ ఇష్యూపై ఫోకస్​ చేసి మార్చి నెలలోనే పాజిటివ్​ సాంకేతాలు ఇచ్చింది. పార్లమెంట్​ఎలక్షన్స్​అడ్డంకితో ఆగిన ప్లాట్స్​ రెగ్యులేషన్​కు ఇప్పుడు గ్రీన్​సిగ్నల్​ఇచ్చేసింది.  వీలైనంత స్పీడ్​గా ఎల్​ఆర్ఎస్​సెటిల్​ చేయాలని డిసైడైంది. ఇందుకోసం జిల్లా లెవల్​లో అడిషనల్ కలెక్టర్​(రెవెన్యూ) పర్యవేక్షణలో టీం ఏర్పాటుకు చర్యలు మొదలుపెట్టింది. రెవెన్యూతో పాటు ఇతర శాఖ సిబ్బందిని డిప్యూట్​ చేసి కోర్టు వివాదాలు, గవర్నమెంట్ ల్యాండ్​తో సంబంధంలేని ఇంటి జాగాలను క్రమబద్ధీకరణ చేయనుంది.