పెద్దపల్లి జిల్లాలో టూరిజం స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రామగిరి ఖిల్లా

పెద్దపల్లి జిల్లాలో టూరిజం స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రామగిరి ఖిల్లా
  • అభివృద్ది చర్యలకు సర్కార్ ఆదేశాలు
  • టూరిజంతో మారనున్న ఈ ప్రాంత రూపురేఖలు
  • శిల్పకళ, ప్రకృతి సోయగాలకు నెలవు రామగిరి ఖిల్లా

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని రామగిరి ఖిల్లాను టూరిజం స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఖిల్లా అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికలు, ఖిల్లా చరిత్ర, ప్రాముఖ్యత తదితర అంశాలపై  అధికారులు ఆరా తీశారు. ఇక్కడి శిల్పకళ, ప్రకృతి సోయగాలకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఖిల్లాను అభివృద్ధితో మంథని సహా రామగిరి, ముత్తారం, కాల్వశ్రీరాంపూర్ మండలాలకు లబ్ధి చేరనుంది. దీంతో టూరిస్టు స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీర్చిదిద్దుదామన్న ప్రభుత్వ ప్రకటనలో ఈ మండలాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

అభివృద్ధికి దూరంగా.. 

గతంలో రామగిరి ఖిల్లా మావోయిస్టులకు షెల్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండేది. అందువల్లే రామగిరి ఖిల్లా పరిసర ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదనే వాదనలు ఉన్నాయి. గతంలో ఖిల్లాకు చుట్టుపక్కల గ్రామాలు బేగంపేట, రత్నాపూర్, మచ్చపేట, మైదబండ, లక్కారం లాంటి గ్రామాలకు రవాణా సౌకర్యాల్లేవు. దీంతో మావోయిస్టులు షెల్టర్​జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చేసుకున్నారు. ఈ ప్రాంతంలో మావోయిస్టు పార్టీలోనే మొట్టమొదటి కోవర్టు ఆపరేషన్ జరిగింది. 

దీంతో రామగిరి ఖిల్లా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత చాలా కాలం తర్వాత రోడ్డు సౌకర్యాలు కొంత ఏర్పడినప్పటికీ ఖిల్లా కిందిభాగం వరకు రోడ్డు లేకపోవడంతో దాదాపు 10కి.మీ కాలినడక తప్పడం లేదు. రానున్న రోజుల్లో రామగిరి ఖిల్లాకు నాలుగు వైపులా రహదారులు రానున్నాయి. ఇప్పటికే గ్రీన్ ఫీల్డ్ హైవే ఖిల్లాకు దగ్గరలో నుంచి ముత్తారం మీదుగా పోతుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి కునారం మీదుగా ఇదులాపూర్ నుంచి ముత్తారం మీదుగా భూపాలపల్లికి రోడ్డు కూడా మంజూరైంది. దీంతో రామగిరి ఖిల్లా మరో కొద్దికాలంలోనే ఫేమస్ టూరిజం స్పాట్
 కానుంది. 

పెద్దపల్లికి 20కి.మీ దూరంలో.. 

పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి 20 కి.మీ దూరంలో బేగంపేట, రత్నాపూర్, కల్వచర్ల  గ్రామాల మధ్య విస్తరించి ఉంది. ప్రతీ ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కాలేజీ, యూనివర్సిటీ స్టూడెంట్స్, ఆయుర్వేద డాక్టర్లు, బోటనీ సైంటిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, బొటానికల్ టూర్ కోసం ఇక్కడకు వస్తుంటారు. ఖిల్లాను చేరుకోవడానికి ప్రస్తుతం ఎలాంటి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖిల్లా పైకి చేరుకోవడానికే దాదాపు 10 కిలోమీటర్ల పైగా ఉంటుంది.  బేగంపేట నుంచి రోడ్డు ఏర్పాటు చేయాలని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ ఖిల్లా  టూరిస్టు స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారితే ఈ ప్రాంతానికి రోడ్డు, రవాణా, ఇతర వ్యాపారాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది.