కూసుమంచిలో100 పడకల  ఆసుపత్రి మంజూరు

కూసుమంచిలో100 పడకల  ఆసుపత్రి మంజూరు

కూసుమంచి, వెలుగు :  కూసుమంచి మండలానికి రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస​రెడ్డి చొరవతో 100 పడకల ఆసుపత్రిని ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు కలెక్టర్​ ముజామ్మిల్​ఖాన్​ శుక్రవారం కూసుమంచి రెవెన్యూ ఆఫీసర్లకు  ఆదేశాలు జారీ చేశారు.

మండలంలో గట్టుసింగారం రెవెన్యూ పరిధిలోని కేజీబీవీ పక్కన ఉన్న సర్వే నంబర్​ 12లో సర్వే చేసిన ల్యాండ్​ 5.10ఎకరాలను శనివారం జిల్లా వైద్యాశాఖ ఆఫీసర్లకు అప్పగించనున్నట్లు రెవెన్యూ ఆఫీసర్లు తెలిపారు. దీంతో నేలకొండపల్లి, సూర్యాపేట జిల్లాలోని మోతే, ముదిగొండ మండలాల ప్రజలకు ఉపయోగకరంగా ఉండనుంది.