తెలంగాణ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో భారీగా బదిలీలు : 70 మంది అధికారుల ట్రాన్సఫర్లు

తెలంగాణ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో భారీగా  బదిలీలు : 70 మంది అధికారుల ట్రాన్సఫర్లు

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖలో ప్రక్షాలన ప్రారంభమైంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టిన రోజు నాడే అక్టోబర్ 28న 70 అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో 70 మంది డిప్యూటీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేశారు. ఇటీవల రెవెన్యూ సంఘాలు పదోన్నతులు, బదిలీల గురించి ఆ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాయి. ఈ క్రమంలోనే రెవెన్యూ శాఖలో ఒకే సారి ఇంత పెద్ద సంఖ్యలో బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. 

ALSO READ : ఉజ్వల పథకం కింద 10 కోట్ల మంది మహిళలకు లబ్ధి పొందారు

పలువురు అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, భూ సేకరణ అధికారులు, సివిల్ సప్లయిస్ వంటి శాఖల్లో పని చేస్తున్న వారిని బదిలీ చేశారు. ఎవరూ ఊహించని రీతిలో వేర్వేరు స్థానాలకు ట్రాన్స్‪వర్లు జరిగాయి. ఈ మేరకు సోమవారం రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. హైడ్రా విస్తరణ, కొత్త ఆర్వోఆర్ చట్టం, ధరణి స్థానంలో భూమాత, పెండింగ్ భూ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ స్థలాల రక్షణ వంటి అనేకాంశాల నేపథ్యంలో ఈ బదిలీలు జరిగినట్లు తెలిస్తోంది.