వాహనాల స్క్రాపింగ్ కోసం రాష్ట్రంలో 37 టెస్టింగ్ సెంటర్లు

వాహనాల స్క్రాపింగ్  కోసం రాష్ట్రంలో 37 టెస్టింగ్ సెంటర్లు

రాష్ట్రంలో వాహనాల స్క్రాప్ పాలసీని అమలు చేయనున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు. 15 ఏండ్లు పైబడిన వ్యక్తిగత వాహనాలను స్వచ్ఛందంగా స్క్రాపింగ్​ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక రాయితీలు ఇస్తున్నట్టు తెలిపారు. ఇంటర్ స్టేట్ రిలేషన్స్‌‌‌‌‌‌‌‌కు ఇబ్బంది వస్తుండడంతో రాష్ట్రం మంగళవారం నుంచి సారథి, వాహన్​ పోర్టల్‌‌‌‌‌‌‌‌లో చేరుతున్నట్టు ప్రకటించారు.  

వాహనాల చెకింగ్‌‌‌‌‌‌‌‌కు సరైన విధానం అమలు జరగడం లేదని, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ తీసుకొస్తున్నామని చెప్పారు. ఒక్కో సెంటర్‌‌‌‌‌‌‌‌కు రూ.8 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. ఇక  ప్రభుత్వ పాత వాహనాలను ఈ– ఆక్షన్​ ద్వారా దశలవారీగా తొలగిస్తామని చెప్పారు. ఈ క్రమంలో స్క్రాపింగ్ కోసం రాష్ట్రంలో 37 కొత్త టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

37 టెస్టింగ్​ సెంటర్లకు అనుమతి

సొంత వెహికల్ 15 ఏండ్లు దాటిన తర్వాత వలంటీర్​గా స్క్రాపింగ్ కోసం ఇస్తే  సర్టిఫికెట్​ ఆఫ్డిపాజిట్​ వస్తుందని  ట్రాన్స్​పోర్ట్​ కమిషనర్  ఇలంబర్తి తెలిపారు. వచ్చే రెండేండ్లలో అదే రేంజ్​లో కొత్త వాహనం కొంటే  దాని ఎంవీ టాక్స్ లో మినహాయింపు ఉంటుందని వివరించారు.  పాత బకాయిలు ఉన్నా వెహికల్​ స్క్రాప్ కి తీసుకెళ్తే వన్ టైం సెటిల్​మెంట్ చేసేలా కూడా అవకాశం ఉందని చెప్పారు.  ప్రభుత్వం 37 ఆటో మేటెడ్​ టెస్టింగ్ సెంటర్స్ పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చిందని, జిల్లాలో 33,  హైదరాబాద్ లో 4 అదనంగా పెట్టనున్నట్టు చెప్పారు.

ఒక్కో దానికి రూ.8 కోట్లు అవసరం అవుతుండగా.. మొత్తం రూ. 296 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. సారథి, వాహన్  సాఫ్ట్​వేర్​ను ఏడాదిలోపు మొత్తం ఇంప్లిమెంట్ చేస్తామని, సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్​ జరుగుతున్నదని చెప్పారు. 15 ఏండ్లు దాటిన ప్రైవేట్ వాహనాలను కచ్చితంగా స్క్రాపింగ్ చేసుకోవాలనే కండిషన్​ లేదని, వారి ఇష్టపూర్వకంగానే  చేసుకోవచ్చునని తెలిపారు. ట్రాన్స్ పోర్ట్ వాహనాలకు 8 ఏండ్లలోపు ప్రతి ఏటా, త్రైమాసికంలో పన్నుపై 10 శాతం రాయితీ ఇస్తారన్నారు. 15 ఏండ్లు దాటిన వాహనాలు స్క్రాప్ కి పంపించకుండా రిజిస్ట్రేషన్ మళ్లీ చేసుకోవాలంటే అదనంగా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందని వెల్లడించారు.