60 రోజుల్లో కోటిన్నర కేస్ల బీర్ల అమ్మకమే టార్గెట్

60 రోజుల్లో కోటిన్నర కేస్ల బీర్ల అమ్మకమే టార్గెట్


ఎండకాలం, పెండ్లిళ్ల సీజన్, ఐపీఎల్ మ్యాచ్‌‌‌‌ల ప్రభావంతో రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి.  రాష్ట్రవ్యాప్తంగా రోజుకు దాదాపు 3 లక్షల బీర్ కేస్‌‌‌‌లు అమ్ముడవుతున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే ఇది రెట్టింపు స్థాయిలో ఉందని వ్యాపార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. 

ఈ ఏడాది లిక్కర్‎తో పాటు బీర్ కేస్‎లను మరింతగా పెంచాలని ఎక్సైజ్ శాఖ టార్గెట్‎గా పెట్టుకున్నది. గతేడాది కంటే కోటిన్నర కేసుల బీర్లు ఎక్కువగా అమ్మాలని అనుకుంటున్నది. పోయిన ఆర్థిక సంవత్సరంలో దాదాపు 5.48 కోట్ల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. ఈసారి ఐఎంఎల్ లిక్కర్ కేస్​లు కూడా 4 కోట్ల కేస్​లకు పెంచాలని ప్లాన్ చేశారు. 

కానీ, బీర్ల సేల్స్​కు ఏప్రిల్, మే నెలలే కీలకం కావడంతో వాటి అమ్మకంపైనే ఎక్సైజ్ శాఖ ప్రధానంగా దృష్టి పెట్టింది. రోజుకు యావరేజ్‎గా 3 లక్షలకు పైగా కేసుల బీర్లు అమ్మాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఐపీఎల్ మొదలైన మార్చి 22వ  రోజు ఏకంగా దాదాపు నాలుగు లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. 

ఆ తరువాత  కూడా ప్రతి రోజు యావరేజ్‎గా మూడు లక్షల కేస్ లకు దగ్గరలో బీర్లు అమ్మినట్లు ఎక్సైజ్ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఏదైనా సెలవు కారణంగా మద్యం డిపోల నుంచి లిక్కర్, బీర్ లిఫ్ట్ చేయకపోతే.. ఆ తరువాతి రోజు రెట్టింపు స్థాయిలో కేస్​లు లిఫ్ట్ చేయాలని ఆదేశాలు ఉన్నాయి. ఇలా ఈ రెండు నెలల్లో కోటిన్నర కేస్​ల బీర్లు అమ్ముడుపోయేలా చేయాలని చూస్తున్నారు.