రైతు కమిషన్ సభ్యులను నియమించిన తెలంగాణ సర్కార్

రైతు కమిషన్ సభ్యులను నియమించిన తెలంగాణ సర్కార్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఏర్పాటు చేసిన నూతన రైతు కమిషన్‎కు సభ్యులను నియమించింది. మొత్తం ఏడుగురిని రైతు కమిషన్ సభ్యులుగా నియమిస్తూ ఈ మేరకు సోమవారం (అక్టోబర్ 21) వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేవీ నర్సింహారెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్, మరికంటి భవానీ, న్యాయవాది సునీల్, రాంగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, గంగాధర్‎లను కమిషన్ మెంబర్లుగా అపాయింట్ చేసింది. 

ALSO READ | పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్

కాగా, 2024, సెప్టెంబర్ 7వ తేదీన తెలంగాణ ప్రభుత్వం రైతు కమిషన్‎ను ప్రభుత్వం ఏర్పాటు  చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డికి రైతు కమిషన్ చైర్మన్‎ పగ్గాలు అప్పగించింది. తాజాగా.. రైతు కమిషన్‎కు ఏడుగురు సభ్యులను నియమించింది.