రామచంద్రాపురం, వెలుగు: పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ఇండ్లలోత్వరలోనే అన్ని సౌకర్యాలను కల్పిస్తామని కలెక్టర్క్రాంతి హామీఇచ్చారు. శుక్రవారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ డబుల్ బెడ్రూమ్ల వద్ద వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొల్లూర్ డబుల్బెడ్రూమ్లు ప్రైమ్లొకేషన్లో ఉన్నాయని ఇక్కడ మరో 30 వేల జనాభా నివసించేందుకు అవకాశం ఉందన్నారు.
నగరాలకు తీసి పోకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు. ప్రైమరీ స్కూల్, అంగన్వాడీ, డ్రైనేజీ, తాగునీరు, లిఫ్ట్, టెలీ కమ్యూనికేషన్, రేషన్షాపు, బస్ సౌకర్యం, పోలీస్సెక్యూరిటీ తదితర వసతులను కల్పించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 7 వేల 258 కుంటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయని, మిగతా ఇండ్లను కూడా త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు.
చదువుకునే చిన్నారుల సంఖ్యకు అనుగుణంగా స్కూల్ ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాల కోసం ఏఎన్ఎంలను నియమించి, హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని వైద్య శాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో ఆర్డీవో రవీందర్రెడ్డి, డీఈవో వెంకటేశ్వర్లు, డిస్ర్టిక్వెల్ఫేర్ఆఫీసర్ లలిత కుమారి, తహసీల్దార్ సంగ్రామ్ రెడ్డి, జీహెచ్ఎంసీ, మున్సిపల్, హెచ్ఎండీఏ అధికారులు పాల్గొన్నారు.