శనివారం(అక్టోబర్ 12) సాయంత్రంలోగా ఇందిరమ్మ కమిటీలు

శనివారం(అక్టోబర్ 12) సాయంత్రంలోగా ఇందిరమ్మ కమిటీలు
  • ఒక్కో కమిటీలో ఏడుగురు
  • ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో వాళ్లే కీలకం
  • చైర్మన్ గా గ్రామాల్లో సర్పంచ్, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్

హైదరాబాద్: ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులను ఎంపిక చేసేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనుంది. శనివారం సాయంత్రంలోగా కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచ్ లేదా స్పెషల్ ఆఫీసర్ చైర్మన్ గా ఉంటారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు సభ్యులుగా ఉంటారు. ఈ ముగ్గురిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఒకరు. ఎస్సీ లేదా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు ఒకరు తప్పక సభ్యలుగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఈ కమిటీకి పంచాయతీ కార్యదర్శి కన్వీనర్ గా ఉంటారు. 

మున్సిపాలిటీల్లో వార్డుల/ డివిజన్ల వారీగా కమిటీలు ఉండనున్నాయి. స్వయం సహాయక సంఘాలకు చెందిన ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు సభ్యులుగా ఉంటారు. ఈ ముగ్గురిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఒకరు, ఎస్సీ లేదా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు ఒకరు తప్పక సభ్యలుగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. వార్డు ఆఫీసర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలు ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ను ఎంపిక చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. సామాజిక తనిఖీలు చేసే అధికారం కూడా ఈ కమిటీలకు ఉంటుంది.