
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ గ్రాండ్ మాస్టర్ రాజా రిత్విక్ లప్లేన్ ఇంటర్నేషనల్ చెస్ చాంపియన్షిప్లో సిల్వర్ మెడల్తో మెరిశాడు. ఫ్రాన్స్లోని లప్లేన్లో శనివారం ముగిసిన ఈ టోర్నీలో రిత్విక్ తొమ్మిది రౌండ్లకు గాను ఏడు పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. 22 దేశాల నుంచి 184 మంది ప్లేయర్లు పడ్డ ఈ టోర్నీలో రిత్విక్ ఐదు గేమ్స్లో గెలిచి, నాలుగు గేమ్స్ను డ్రా చేసుకున్నాడు. టోర్నీలో అజేయంగా నిలిచి రన్నరప్ టైటిల్ గెలిచాడు.