
తెలంగాణ రాష్ట్రంలోని 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో 2024-–25 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్స్కు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ టీఎస్ఆర్జేసీ సెట్-2024 నోటిఫికేషన్ను విడుదల చేసింది.
సీట్లు: మొత్తం 2,996 సీట్లలో ఎంపీసీ–1,496, బైపీసీ–1,440, ఎంఈసీ–60 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
అర్హత: 2024 మార్చిలో జరుగనున్న పదోతరగతి పరీక్షలో మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్: ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. విద్యార్థులు ఎంపిక చేసుకునే గ్రూప్ ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఎంపీసీ పరీక్షకు ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్; బైపీసీకి ఇంగ్లీష్, బయాలజీ,
ఫిజికల్ సైన్స్; ఎంఈసీ పరీక్షకు ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, గణితం సబ్జెక్టుల నుంచి పదోతరగతి స్థాయిలో ఒక్కో సబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మార్చి 16 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు రూ. 200 ఉంటుంది. రాతపరీక్ష ఏప్రిల్ 21న నిర్వహిస్తారు. మొదటి దశ కౌన్సెలింగ్ మే లో ఉంటుంది. పూర్తి వివరాలకు www.tsrjdc.cgg.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.