ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జులై 8కి వాయిదా

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జులై 8కి  వాయిదా

తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణను జూలై 8కి వాయిదా వేసింది హైకోర్టు. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై   బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద, కౌశిక్ రెడ్డి హైకోర్టులో  పిటిషన్లు వేశారు. .  ఎమ్మెల్యేలు దానం నాగేదందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై స్పీకర్  అనర్హులుగా ప్రకటించాలని  పిటిషన్లో కోరారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు  ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనర్హతపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పులున్నా పరిగణలోకి తీసుకోవడంలేదన్నారు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు.  అయితే ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది. 

32కి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య

ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 32కి చేరింది