తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు.. లగచర్ల, హకీంపేటలో భూ సేకరణపై స్టే

తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు.. లగచర్ల, హకీంపేటలో భూ సేకరణపై స్టే

హైదరాబాద్: లగచర్ల, హకీంపేటలో భూ సేకరణపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ భూములకు సంబంధించిన భూ సేకరణ నోటిఫికేషన్ను హైకోర్టు రద్దు చేసింది. లగచర్ల, హకీంపేటలో భూసేకరణపై హైకోర్టు స్టే విధించింది. భూసేకరణ నోటిఫికేషన్ లో 8 ఎకరాల వరకు ఉన్న భూసేకరణ ను ఆపాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.

దుద్యాల మండలంలోని లగచర్ల,  పోలేపల్లి, హకీంపేట్, పులిచర్లకుంట తండా, రోటిబండ తండాల పరిధిలో ఇండస్ట్రియల్​ కారిడార్ కోసం 1177 ఎకరాల భూసేకరణకు టీజీఐఐసీ ద్వారా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 534 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా 643 ఎకరాలు పట్టా భూమి ఉందని దుద్యాల తహసీల్దార్​ కిషన్​ తెలిపారు. 

Also Read : కేటీఆర్ రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నరు

నష్టపరిహారం కింద ఎకరాకు రూ.20 లక్షలు, 150 గజాల ప్లాటు, ఇంటికో ఉద్యోగం, ఇందిరమ్మ ఇంటి మంజూరుకు వికారాబాద్​ కలెక్టర్​రైతులకు హామీ ఇవ్వడంతో భూసేకరణకు అంగీకరించారు. పోలేపల్లి, హకీంపేట్, లగచర్ల , పులిచర్లకుంట తండాలో ఇప్పటికే సర్వే పూర్తయింది. పోలేపల్లి రైతులకు నష్టపరిహారం అందించారు. రోటిబండ తండా పరిధిలో ఉన్న 17 ఎకరాల ప్రభుత్వ భూమిని సర్వే చేసేందుకు అధికారులను రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.