గ్రూప్‌-1: టీజీపీఎస్సీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు

గ్రూప్‌-1: టీజీపీఎస్సీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు

హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)కి రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది.  గ్రూప్‌-1 పోస్టుల భర్తీలో రిజర్వేషన్ల అమలుపై వివరణ ఇవ్వాలని ఈ నోటీసులో హైకోర్టు ఆదేశించింది. కాగా, టీజీపీఎస్సీ 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి.. ఇప్పటికే ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. అక్టోబర్‎లో మెయిన్స్ పరీక్ష జరగనుంది. 

ఇదిలా ఉంటే, రిజర్వేషన్లపై జీవో 29ని సవాల్ చేస్తూ  కొందరు అభ్యర్థులు తెలంగాణ హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‎పై ఇవాళ (గురువారం) విచారణ చేపట్టిన ధర్మాసనం.. టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్ల అమలుపై వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఈ కేసు విచారణను సెప్టెంబర్ 27కు వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది హైకోర్టు.