Janwada Farmhouse Case: జన్వాడ ఫాం హౌజ్ కూల్చివేతలపై హైకోర్టులో జరిగిన వాదనలివి..

Janwada Farmhouse Case: జన్వాడ ఫాం హౌజ్ కూల్చివేతలపై హైకోర్టులో జరిగిన వాదనలివి..

హైదరాబాద్: జన్వాడ ఫాం హౌజ్ కూల్చివేతలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. హైడ్రా ఏర్పాటు జీవో, ఏర్పాటుకు కారణాలను ఏఏజి కోర్టుకు వివరించారు. హైడ్రా ఇప్పటి వరకు ఎన్ని బిల్డింగ్లను కూల్చి వేసిందని, కూల్చివేతలకు హైడ్రాకు ఉన్న అధికారం ఏంటని -హైకోర్టు ప్రశ్నించింది. జీహెచ్ఎంసీతో సమన్వయం చేసుకుని కూల్చివేతలు చేస్తున్నామని ఏఏజి తెలిపారు.

Also Read :- ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్

కూల్చివేతలకు ముందు ఎలాంటి లీగాలిటీస్ పాటిస్తున్నారని- హైకోర్టు అడగ్గా.. నోటీసులు ఇచ్చే కూల్చివేతలు చేపడుతున్నామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ చెప్పారు. అవసరమైతే హైడ్రా కమిషనర్ను కోర్టులో హాజరుకావాలని అదేశిస్తామని- హైకోర్టు స్పష్టం చేసింది. జన్వాడ  ఫామ్ హౌస్ కూల్చివేతలపై నిబంధనల ప్రకారం నడుచుకుంటామని - అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. హైడ్రా తరపు న్యాయవాది విచారణకు హాజరు కాకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జన్వాడ ఫాం హౌజ్ కూల్చివేతలపై వాదనలు జరిగిన తీరిది..

హైకోర్టు:  జన్వాడ మున్సిపాలిటీ కిందకు వస్తుందా లేదా గ్రామ పంచాయితీకి వస్తుందా ?

ఏఏజి: నార్సింగ్ మున్సిపాలిటీకి వస్తుంది

పిటిషనర్ అడ్వకేట్: ఫామ్ హౌస్ నిర్మాణానికి అనుమతి గ్రామ పంచాయితీ నుంచి తీసుకున్నాం

పిటిషనర్: 2014 సెప్టెంబర్లో నిర్మాణం చేశాం

హైకోర్టు: ఇరిగేషన్ అధికారులు FTL ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారా ?

హైడ్రా తరపు న్యాయవాది: జన్వాడ ఫామ్ హౌస్ హైడ్రా పరిధిలో రాకున్నా పార్టీ చేశారు

హైకోర్టు: జన్వాడ ఫామ్హౌస్ కూల్చివేతలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి

హైకోర్టు: ఫామ్హౌస్కు సంబంధించిన పత్రాలను హైడ్రా కమిషనర్ పరిగణనలోకి తీసుకొని పరిశీలించాలి.

 

రంగారెడ్డి జిల్లా శంకర్‌‌‌‌పల్లి మండలం జన్వాడలో జీవో 111 నిబంధనలకు వ్యతిరేకంగా మాజీ మంత్రి కేటీఆర్‌‌‌‌ ఫామ్‌‌‌‌ హౌస్‌‌‌‌ కట్టుకున్నారనేది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఫామ్ హౌస్‌‌‌‌ కేటీఆర్​దే కాదనేది బీఆర్ఎస్ వాదన. తాజాగా కూల్చివేతలతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది.