గ్రూప్‌‌-1 ఎగ్జామ్ వాయిదా వేయలేం : హైకోర్టు

గ్రూప్‌‌-1 ఎగ్జామ్ వాయిదా వేయలేం : హైకోర్టు

హైదరాబాద్,  వెలుగు:  ఈ నెల 9న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్‌‌ పరీక్షను వాయిదా వేయాలని ఆదేశించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. 9న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అసిస్టెంట్‌‌ సెంట్రల్‌‌ ఇంటెలిజెన్స్‌‌ ఆఫీసర్‌‌ గ్రేడ్‌‌-1,  ఎగ్జిక్యూటివ్‌‌  పోస్టులకు స్క్రీనింగ్‌‌ పరీక్ష ఉన్నందున గ్రూప్‌‌-1 ప్రిలిమ్స్‌‌ను వాయిదా వేసేలా ఆదేశించాలంటూ ఎం.గణేశ్,  భూక్యా భరత్‌‌ హైకోర్టులో పిటిషన్‌‌ వేశారు.  దీనిపై  జస్టిస్‌‌ పుల్లా కార్తీక్‌‌ విచారణ చేపట్టారు.  గ్రూప్‌‌-1 ప్రిలిమ్స్‌‌ పరీక్ష వాయిదా వేయడానికి  నిరాకరించారు.