
ఉగాది పర్వదినం సదర్భంగా శ్రీ విశ్వా వసు నామ ఉగాది వేడుకలు రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అధికార యంత్రాంగం మొదలైనవారు పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగం చదివి వినిపించారు. తెలంగాణ పంచాంగం ఎలా ఉందో చెప్పారు.
ఈ సందర్భంగా పంచాంగం హైలైట్స్:
- తెలంగాణా రాష్ట్రంలో వర్షాలు బాగా పడతాయి.
- అభివృద్ధి దిశగా దూసుకెళ్తుంది.
- సోషల్ మీడియా భయపెడుతుంది.
- తెలంగాణలో రిజిస్ట్రేషన్లు పరుగులు పెడతాయి.
- కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం ప్రభుత్వం బాగా కృషి చేస్తుంది.
- విద్య, వైద్యం పై ప్రభుత్వం బాగా ప్రాధాన్యత ఇస్తుంది.
- రెండు రాష్ట్రాల సీఎంలు పోటీపడి పరిపాలన కొనసాగిస్తారు.
- ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా పరిపాలన మెరుగుగా కొనసాగిస్తుంది.
- ఆదివారం నాడు చుక్క ముక్క వండుకోవద్దు.. దాని ద్వారా మంచి పరిణామాలు చూస్తాం..
►ALSO READ | శ్రీ విశ్వావసు నామ సంవత్సర గంటల పంచాంగం.. జాతకాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి