
తెలంగాణ ఖోఖో టీమ్(మెన్స్) ఆర్ఎస్బీ బెంగుళూరు టీమ్ పై 27–-13 తేడాతో గెలిచి క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీఎస్ఖోఖో స్పోర్ట్స్ మీట్లో ఇప్పటికే తెలంగాణ మెన్స్ టీమ్ కర్ణాటక, రాజస్థాన్ టీమ్స్ పై విజయకేతనం ఎగరవేసింది. తాజాగా ఆర్ఎస్బీ బెంగుళూరు టీమ్ను ఓడించి క్వాటర్స్కు దూసుకెళ్లింది. తెలంగాణ టీమ్కు కోచ్గా కానుకుంట్ల స్వామి(సెక్షన్ఆఫీసర్), మేనేజర్గా టి.స్వర్ణ రాజ్ వ్యవహరిస్తున్నారు. – హైదరాబాద్సిటీ, వెలుగు