- తెలంగాణ సమస్యలపై అధ్యయనం చేసేందుకు 1985లో విద్యావంతుల సదస్సు కరీంనగర్లో ఏర్పాటైంది.
- 1986లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు ఏర్పడింది.
- 1980వ దశకంలో తెలంగాణ సమస్యలపై మా తెలంగాణ మాస పత్రిక ప్రారంభమైంది.
- 1989లో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలపై రాష్ట్ర అసెంబ్లీలో పెద్ద స్థాయిలో చర్చ జరిగింది.
- 1989లో తెలంగాణ అభివృద్ధి ఫోరం వివిధ కార్యక్రమాలు చేపట్టింది.
- 1991లో తెలంగాణ స్టూడెంట్స్, తెలంగాణ లిబరేషన్ ఫ్రంట్ సంస్థల ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అనేక ఆందోళనలు జరిగాయి.
- తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్ కాకతీయ విశ్వవిద్యాలయశాఖ 1992లో ఏర్పడింది.
- 1992లో తెలంగాణ సమస్యలపై అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు ప్రభుత్వానికి తెలంగాణ ఇంజినీర్ల సంఘం సమర్పించింది.
- 1993, ఆగస్టులో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చిన్న రాష్ట్రాలపై జాతీయ సదస్సు జరిగింది.
- 1993, ఆగస్టులో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన చిన్న రాష్ట్రాలపై జాతీయ సదస్సులో జార్జి ఫెర్నాండెజ్ ప్రసంగించారు.
- తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంలో 1996లో వరంగల్లో జరిగిన సదస్సులో తెలంగాణ మహాసభ, తెలంగాణ ప్రజా పార్టీ సంస్థలు ఆవిర్భవించాయి
- 1997, డిసెంబర్లో అఖిల భారత ప్రజాప్రతిఘటన వేదిక ఆధ్వర్యంలో సమరయోధుడు, కవి కాళోజీ నారాయణ నేతృత్వంలో ప్రజాస్వామిక తెలంగాణ సదస్సు జరిగింది.
- 1998లో ప్రొఫెసర్ జయశంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఐక్యవేదిక ఏర్పడింది.
- మాజీ మంత్రి ఇంద్రారెడ్డి అధ్యక్షతన తెలంగాణ ఉద్యమ కమిటీ ఏర్పడింది.
- 1999లో అమెరికాలోని న్యూయార్క్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ అనే ఉద్యమ సంస్థ ఏర్పడింది.
- తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన భువనగిరి సదస్సు 1997, మార్చి 8,9 వ తేదీల్లో జరిగింది.
- భువనగరిలోని ఇండియా మిషన్ స్కూల్ ఆవరణలో 1997, మార్చి 8, 9వ తేదీల్లో జరిగిన సదస్సులో కాళోజీ నారాయణరావు ప్రధాన వక్తగా వ్యవహరించారు.
- భువనగిరి సదస్సులో పాల్గొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని బహుజన రిపబ్లిక్ పార్టీ అధ్యక్షుడు కె.జి.సత్యమూర్తి డిమాండ్ చేశారు.
- వరంగల్ డిక్లరేషన్ విడుదల చేసిన వరంగల్ సదస్సు 1997లో జరిగింది.
- ప్రత్యేక రాష్ట్ర సాధనకు ప్రజలను సమాయత్తం చేయాలని వరంగల్ డిక్లరేషన్ పిలుపు ఇచ్చింది.
- 1956–90 మధ్య వ్యవసాయ కూలీల సంఖ్య ఆంధ్ర ప్రాంతంలో ఒక్క శాతం పెరగగా, తెలంగాణ ప్రాంతంలో 30శాతం నుంచి 47శాతానికి పెరిగింది.
- ప్రత్యేక తెలంగాణ కోసం రెండో ఎస్సార్సీని ఏర్పాటు చేసే విషయం ఆలోచించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 2001, ఏప్రిల్లో తీర్మానం చేసింది.
- 610 జీవో అమలు తీరును పరిశీలించడం కోసం 2001, జూన్ 25న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిర్గ్లాని కమిషన్ ఏర్పాటు చేసింది.
- గిర్గ్లాని కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి 2004, సెప్టెంబర్లో సమర్పించింది.
- 610 జీవో అమలులో 18 రకాల ఉల్లంఘనలు జరిగినట్లు గిర్గ్లాని కమిషన్ పేర్కొంది.
- వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక రాష్ట్రాల కోసం ఉద్యమిస్తున్న వారందరితో చిన్న రాష్ట్రాల సమాఖ్య ఏర్పడింది.
- 2004లో కరీంనగర్లో జరిగిన బహిరంగసభలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను తమ పార్టీ నెరవేరుస్తుందని విస్పష్టంగా ప్రకటించారు.
- యూపీఏ ప్రభుత్వం తెలంగాణ అంశాన్ని రాష్ట్రపతి ప్రసంగంలో 2004, జూన్ 7న చేర్చింది.
- తెలంగాణ అంశంపై విస్తృత అంగీకారం కోసం యూపీఏ ప్రభుత్వం 2005లో ప్రణబ్ ముఖర్జీ ఆధ్వర్యంలో ఒక ఉపసంఘాన్ని నియమించింది.
- ప్రణబ్ ముఖర్జీ ఉపసంఘానికి తెలంగాణకు అనుకూలంగా దేశంలోని 36 పార్టీలు లేఖలు ఇచ్చాయి.
- తెలంగాణలో ఉద్యమం తిరిగి పుంజుకోవడానికి హైదరాబాద్ ఫ్రీజోన్ అని కోర్టు ఇచ్చిన తీర్పు దోహదం చేసింది.
- 2010, డిసెంబర్లో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికను సమర్పించింది.
- కేంద్ర ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికను 2011, జనవరి 6న బహిరంగపరిచింది.
- హైదరాబాద్తో కూడిన 10 జిల్లాల తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తున్నట్లు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 2013, జులై 30న ప్రకటించింది.
- తెలంగాణపై వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయం తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 2013, అక్టోబర్ 8న ఎ.కె.ఆంటోని చైర్మన్గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ను ఏర్పాటు చేసింది.
- తెలంగాణ ముసాయిదా బిల్లును 2013, డిసెంబర్ 5న కేంద్ర కేబినెట్ఆమోదించింది.
- యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లును లోక్సభలో 2014, ఫిబ్రవరి 13న ప్రవేశపెట్టింది.
- రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లును రాజ్యసభలో 2014, ఫిబ్రవరి 20న ప్రవేశపెట్టారు.
- తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినంగా 2014, జూన్ 2ను 2014, మార్చి 4న ప్రకటించారు.
- కాంగ్రెస్ నేత జానారెడ్డి కన్వీనర్గా 1990లో తెలంగాణ ఫోరం ఏర్పాటు చేశారు.
- చిన్నారెడ్డి కన్వీనర్గా తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరం ఏర్పాటైంది.
- ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్రెడ్డి తెలంగాణ ఏర్పాటుపై అభిప్రాయాలు సేకరించడానికి 2008లో రోశయ్య ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది.
- 1997లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ తెలంగాణకు అనుకూలమని బీజేపీ అగ్రనేత వాజ్పేయి ప్రకటించారు.
- భారతీయ జనతా పార్టీ ఒక్క ఓటు – రెండు రాష్ట్రాలు నినాదంతో 1997లో కాకినాడ తీర్మానం చేసింది.
-
- ALSO READ :బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభం 1,458 కోట్లు