పెద్దవాగు ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి తుమ్మల

పెద్దవాగు ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి తుమ్మల

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆయా ప్రాజెక్ట్ పరిసరాల ప్రజలు భయాందోళనలకు గురువుతున్నారు. ఈ క్రమంలో  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పెద్దవాగు ప్రాజెక్టును వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. 

వరద ఉధృతిని తట్టుకునేలా తగు చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వరదలతో ఎలాంటి గండి పడకుండా చర్యలు చేపట్టినట్లు రైతులకు భరోసా కల్పించారు.