
వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్లో కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో డిఫరెంట్లీ ఏబుల్ (మూగ, చెవిటి) టూరిస్టుల సౌలత్ కోసం క్యూఆర్ కోడ్ బోర్డు మంగళవారం ఏర్పాటు చేసినట్లు టూరిజం శాఖ జిల్లా అధికారి మల్లేశం తెలిపారు.
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో తెలంగాణలోని రెండు చారిత్రక కట్టడాలైన గోల్కొండ, రామప్పలో పైలెట్ ప్రాజెక్టు కింద ఈ బోర్డులో ఏర్పాటు చేశామన్నారు. డిఫరెంట్లీ ఏబుల్ సందర్శకులు క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయగానే టెంపుల్ విశిష్టత ఇండియన్, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ల్లో సైగలు, మాటలు వీడియో రూపంలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కోడ్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ టూరిస్టులకు కూడా ప్రయోజనం ఉంటుందన్నారు.