
- తెలంగాణ ప్రజా సమితి 1969, మార్చి 25న ఆవిర్భవించింది.
- సిద్దిపేటకు చెందిన న్యాయవాది మదన్ మోహన్ తెలంగాణ ప్రజా సమితి మొదటి అధ్యక్షుడయ్యారు. తొలి కార్యదర్శి వెంకట్రామరెడ్డి.
- తెలంగాణ ఉద్యమంలో తొలి బంద్ సదాశివపేట కాల్పులకు నిరసనగా 1969, మార్చి 3న జరిగింది.
- 1969, మార్చి 8, 9వ తేదీల్లో తెలంగాణ సదస్సు రెడ్డి హాస్టల్లో జరిగింది. ఈ సదస్సుకు సదాలక్ష్మి అధ్యక్షత వహించారు.
- 1969 మార్చి 11 నుంచి విద్యార్థుల నిరవధిక సమ్మె ప్రారంభమైంది.
- 1969, మార్చి 17న ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోరాట దినం పాటించారు.
- ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఆంధ్రా నాయకుడు ఎన్.జి.రంగా సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
- తెలంగాణ రక్షణను అమలు చేయకపోతే సత్యాగ్రహం చేస్తామని మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి ప్రకటించారు.
- నాన్ ముల్కీలను ఉద్యోగాల నుంచి తొలగించాలని తెలంగాణ ఉపాధ్యాయ, ఉద్యోగులు సచివాలయం ముందు 1969, మార్చి 24న నిరాహార దీక్ష ప్రారంభించారు.
- 1969 మార్చి 27న ప్రత్యేక తెలంగాణ మాత్రమే ఏకైక లక్ష్యమని తెలంగాణ
- ప్రాంతీయ సంఘం మాజీ అధ్యక్షుడు అచ్యుత్రెడ్డి ప్రకటించారు.
- ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు జామై ఉస్మానియా రైల్వేస్టేషన్పై 1969 మార్చి 28న దాడి చేసి నిప్పు పెట్టారు.
- తెలంగాణకు మేఘాలయా లాగా ప్రాంతీయ ప్రతిపత్తిని కోరుతూ 1969 మార్చి 29న కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవికి రాజీనామా చేశాడు.
- 1969, మార్చి 30న ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితిని కొండా లక్ష్మణ్ బాపూజీ ఏర్పాటు చేశారు.
- రక్తసిక్తమైన కమ్యూనిస్టు పార్టీ బహిరంగ సభ 1969, ఏప్రిల్ 5న సికింద్రాబాద్ అంజలీ టాకీసు చౌరస్తాలో జరిగింది.
- తెలంగాణ ఉద్యమంలో మొదటిసారిగా ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) చట్టాన్ని 1969 ఏప్రిల్ 6న అమలు చేశారు.
- తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు మదన్మోహన్ను పీడీ చట్టం కింద అరెస్టు చేయడంతో ఆయన స్థానంలో అధ్యక్షునిగా ఎస్.బి.గిరిని నియమించారు.
- ఎస్.బి.గిరి తర్వాత తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షురాలిగా సదాలక్ష్మి ఎన్నికైంది.
- తెలంగాణ సమస్య పరిష్కారానికి 1969 ఏప్రిల్ 11న ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ అష్టసూత్ర పథకం ప్రకటించారు.
- తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ పోరాట దినం 1969, ఏప్రిల్ 15న పాటించారు.
- తెలంగాణలో ఉద్యోగుల నిరవధిక సమ్మె 1969, ఏప్రిల్ 15న ప్రారంభమైంది.
- ప్రత్యేక తెలంగాణను సమర్థిస్తూ మర్రి చెన్నారెడ్డి 1969, ఏప్రిల్ 21 ఉద్యమంలోకి ప్రవేశించారు.
- తెలంగాణ ప్రజా సమితి మే డేను డిమాండ్స్ డేగా జరపాలని పిలుపు ఇచ్చింది.
- 1969, మే 1న హైదరాబాద్లో జరిగిన ప్రదర్శనపై పోలీసు కాల్పుల్లో 20 మంది మరణించారు.
- 1969, మే 1న సికింద్రాబాద్లో జరిపిన కాల్పుల్లో మరణించిన సాయం కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఎం.కె.ఉమేందర్.
- 1969, మే 15న తన పదవికి రాజీనామా చేసి ప్రత్యేక తెలంగాణకు మద్దతు పలికిన ప్రముఖ నాయకుడు కొండా వెంకటరంగారెడ్డి.
- హైదరాబాద్ నగరంలో తెలంగాణ మృతవీరుల దినాన్ని 1969, మే 17న పాటించారు.
- తెలంగాణ ప్రాంతంలో పెల్లుబికిన నిరసనలకు, అశాంతికి మౌలిక కారణాలను విశ్లేషించడానికి తెలంగాణలోని విశ్వవిద్యాలయ, కళాశాల అధ్యాపకులు 1969, మే 20న సదస్సు నిర్వహించారు.
- 1969, మే 20న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన సదస్సుకు ప్రొఫెసర్ మంజూర్ ఆలం అధ్యక్షత వహించారు.
- 1969, మే 20న జరిగిన సదస్సులో సమర్పించిన పరిశోధనా పత్రాలన్నింటిని కలిపి తెలంగాణ మూవ్మెంట్ ఇన్ ఇన్వెస్టిగేటివ్ ఫోకస్ అనే పేరుతో గ్రంథంగా ప్రచురించారు.
- తెలంగాణ మూవ్మెంట్ ఇన్ ఇన్వెస్టిగేటివ్ ఫోకస్లో ప్రొఫెసర్ జయశంకర్ రాసిన
- కె.ఎల్.రావు, నాగార్జున సాగర్ వ్యాసంపై పార్లమెంటులో చర్చ జరిగింది.
- తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షునిగా మర్రి చెన్నారెడ్డి 1969, మే 23న ఎన్నుకోబడ్డారు.
- తెలంగాణ ప్రజాసమితికి మర్రి చెన్నారెడ్డి అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి నిరసనగా ఏర్పడి పోటీ తెలంగాణ ప్రజా సమితికి శ్రీధర్రెడ్డి అనే విద్యార్థి నాయకుడు అధ్యక్షుడు అయ్యారు.
- 1969, జూన్ 1లోగా ప్రత్యేక తెలంగాణ ఏర్పడకపోతే రక్తపాతం తప్పదు అని మే 24న హెచ్చరించిన తెలంగాణ ఎన్జీవోల నాయకుడు కేఆర్ ఆమోస్.
- తెలంగాణ మృతవీరుల స్మారక చిహ్నాన్ని నెలకొల్పాలని 1969, మే 31న నిర్ణయించిన ప్రజా సమితి నాయకుడు శ్రీధర్రెడ్డి.
- అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్క్ పార్కులో మృతవీరుల స్మారక స్తూపాన్ని అంతర్జాతీయ ఖ్యాతి పొందిన తెలంగాణ కళాకారుడు ఎక్కా యాదగిరి రూపొందించారు.
- 1969, జూన్ 2 నుంచి 4 రోజులపాటు కొనసాగిన అల్లర్లు, మారణకాండలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 30 మంది మరణించారు.
- ప్రత్యేక తెలంగాణకు మద్దతు పలికిన భారతీయ క్రాంతి దళ్ అధ్యక్షుడు చౌదరి చరణ్సింగ్.
- ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ఆకస్మికంగా 1969, జూన్ 4న అర్ధరాత్రి హైదరాబాద్కు వచ్చారు.
- 1969, జూన్ 6న హైదరాబాద్లో జరిగిన తెలంగాణ రచయితల సదస్సులో కాళోజీ నారాయణరావు అధ్యక్షతన కమిటీ ఏర్పడింది.