బడ్జెట్లలో మద్దతు ధర ఊసే లేదు

బడ్జెట్లలో మద్దతు ధర ఊసే లేదు
  •   రౌండ్​టేబుల్​ సమావేశంలో  రైతు నాయకులు

ముషీరాబాద్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లు రైతులను మోసం చేసేలా ఉన్నాయని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ అన్నారు. శుక్రవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ అధ్యక్షతన కేంద్ర, రాష్ట్ర  వ్యవసాయ బడ్జెట్లపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. 

సాగర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరకు చట్టబద్ధత అంశం ఊసెత్తకపోవడం బాధాకరమన్నారు. స్వామినాథన్ సిఫారసులను గాలికొదిలేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం యాంత్రికరణకు నిధులు కేటాయించలేదన్నారు. భారీ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో అరిబండి ప్రసాద్ రావు, బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్, ధర్మానాయక్, శ్రీరామ్ నాయక్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.