
జూబ్లీహిల్స్, వెలుగు: రాష్ట్రంలోని సెక్యూరిటీ ఏజెన్సీల్లో పనిచేస్తున్న గార్డులకు ఒకే డ్రెస్ విధానం అమలు చేయాలని అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ చైర్మన్ డీఎస్ రెడ్డి, ప్రెసిడెంట్ శ్రీకాంత్ ప్రభుత్వాన్ని, పోలీసులను మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఎవరో చేసిన తప్పుకు అదంరినీ బాధ్యులను చేయడం విచార కరమన్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సెక్యూరిటీ సంస్థలను హెచ్చరించారన్నారు. రాష్ట్రంలో ఉన్న సెక్యూరిటీ ఏజన్సీలన్నిటికీ ఒకే డ్రెస్ కోడ్ ఉండాలని, బౌన్సర్స్కు విధి విధానాలు రూపొందించాలని పోలీసు శాఖను కోరారు.