
- జల్హీ అమృత్ పథకంలోభాగంగా ఏర్పాటు
హైదరాబాద్సిటీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ‘జల్హీ అమృత్’ పథకంలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో వాటర్ రీసోర్స్ రికవరీ సెల్ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా తెలంగాణలోనూ ప్రత్యేకంగా ఒక సెల్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ అర్బన్ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్– అమృత్ 2.0 ఆధ్వర్యంలో ఈ సెల్ పని చేస్తుందని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర స్థాయి వాటర్ రీసోర్స్రి కవరీ సెల్కు చైర్మన్గా మెట్రోవాటర్బోర్డు ఎండీ వ్యవహరిస్తారు.
కో చైర్మన్గా గవర్నమెంట్డిప్యూటీ సెక్రెటరీ(అర్బన్లోకల్బాడీస్, సీఎస్ఎస్), సభ్యులుగా కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇరిగేషన్/అగ్రికల్చర్ నుంచి ఒకరు, విద్యుత్శాఖ నుంచి ఒకరు, పబ్లిక్హెల్త్ ఇంజనీర్ఇన్చీఫ్, పరిశ్రమల శాఖ నుంచి ఒకరు, పొల్యూషన్ కంట్రోల్బోర్డు నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారు. టీయూఎఫ్ఐడీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మెంబర్ కన్వీనర్గా కొనసాగుతారు. ఈ సెల్అర్బన్ వాటర్ ట్రీట్మెంట్ప్లాంట్లను ప్రోత్సహిస్తుంది.
పనితీరును, పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా వాటి నిర్వహణను పరిశీలిస్తుంది. ఫీల్డ్ విజిట్చేసి శుద్ధి చేసిన నీటిని నాణ్యతను, అందులోని బయోసాలిడ్స్పరిశీలించి, ప్రతి మూడు నెలలకోసారి నివేదికను సిద్ధం చేసి కేంద్ర హౌసింగ్అండ్ అర్బన్ వ్యవహారాల శాఖకు సమర్పిస్తుంది.