మైదానాల ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజం:స్పీకర్ గడ్డం ప్రసాద్

మైదానాల ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజం:స్పీకర్ గడ్డం ప్రసాద్

 

  • క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం
  • జాతీయ కరాటే చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌కు హాజరైన స్పీకర్‌‌‌‌ గడ్డం ప్రసాద్‌‌‌‌, మంత్రి పొన్నం ప్రభాకర్​

హైదరాబాద్‌‌‌‌: క్రీడల ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని తెలంగాణ శాసనసభ స్పీకర్‌‌‌‌ గడ్డం ప్రసాద్‌‌‌‌ కుమార్‌‌‌‌ అన్నారు. క్రీడలను ప్రోత్సహించడం అంటే భవిష్యత్‌‌‌‌ తరాలను నిర్మించడమేనని చెప్పారు. గచ్చిబౌలి ఇండోర్‌‌‌‌ స్టేడియంలో జరుగుతున్న 4వ కియో జాతీయ కరాటే చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ పోటీలకు మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌తో కలిసి ముఖ్య ఆతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం చాలా సంతోషకరమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్‌‌‌‌ రెడ్డికి క్రీడలపై ఆసక్తి ఉండటం వల్లే అధిక బడ్జెట్‌‌‌‌ కేటాయించారని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి.. మైదానాల వైపు వెళ్లే దిశగా ప్రభుత్వం వివిధ క్రీడా కార్యక్రమాలు చేపడుతుందన్నారు.

 కరాటేకు తెలంగాణ పల్లెల్లో చాలా ఆదరణ ఉందన్న శాసనమండలి సభ్యులు, తెలంగాణ కరాటే అసోసియేషన్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ మహేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ గౌడ్‌‌‌‌.. చాలా మండల కేంద్రాల్లో కరాటే శిక్షణ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో ఆసియా కరాటే చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ కూడా నిర్వహిస్తామన్నారు. స్పోర్ట్స్‌‌‌‌ అథారిటీ ఆధ్వర్యంలో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీలు హైదరాబాద్‌‌‌‌లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని శాట్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ శివసేనా రెడ్డి తెలిపారు. గ్రామ స్థాయి నుంచి క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి సీఎం చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఈ క్రీడా పోటీల నిర్వహణ అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఎండి శ్రీమతి సోనీ బాలాదేవి, టీమిండియా మాజీ కెప్టెన్‌‌‌‌ అజరుద్దీన్‌‌‌‌, ఒలింపియన్‌‌‌‌ బాక్సర్‌‌‌‌ నిఖత్‌‌‌‌ జరీన్ పాల్గొన్నారు.