ఎస్సారెస్పీ వరద గేట్లు మళ్లీ ఓపెన్​

ఎస్సారెస్పీ వరద గేట్లు మళ్లీ ఓపెన్​

బాల్కొండ, వెలుగు : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ నుంచి వస్తున్న వరద పెరగడంతో ఆఫీసర్లు నాలుగు గేట్లు ఓపెన్​ చేశారు.  శుక్రవారం ఉదయం  8525 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ఎగువ గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలకు వరద పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 34,221 క్యూసెక్కులు చేరిందని ఆఫీసర్లు తెలిపారు.

జలాశయం నిండుకుండలా ఉండటంతో 4 గేట్లు ఓపెన్​చేసి గోదావరిలోకి 12496 క్యూసెక్కులు వదులుతున్నారు. కాకతీయ కాలువకు 6800 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 1200 క్యూసెక్కులు,  లక్ష్మీ కాలువకు 150 క్యూసెక్కులు,సరస్వతీ కాలువకు 500 క్యూసెక్కులు, గుత్ప ఎత్తిపోతల ద్వారా 135 క్యూసెక్కులు విడుదల చేశారు.