
- అటెండ్ కానున్న 5.09 లక్షల స్టూడెంట్లు
- నిర్ణీత టైమ్కు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈనెల 21 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4 వరకూ జరిగే ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5,09,403 మంది విద్యార్థులు అటెండ్ కానున్నారు. దీంట్లో 2,58,895 బాయ్స్, 2,50,508 గర్ల్స్ ఉన్నారు. వీరి కోసం మొత్తం 2,650 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు.
పరీక్షలు రోజూ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, ఫస్ట్ లాంగ్వేజ్ (కాంపోజిట్ కోర్సు) పరీక్ష ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:50 వరకు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే, సైన్స్ సబ్జెక్టులకు ఫిజికల్, బయోలజీ పరీక్షలను ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తామని వివరించారు.
పరీక్షల నిర్వహణ కోసం 2,650 మంది సీఎస్లు, డీఓలను, 28100 మంది ఇన్విజిలేటర్లను నియమించామని తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను www.bse.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. కాగా, నిర్ణీత టైమ్ కన్నా 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇచ్చామని పేర్కొన్నారు. అయితే, విద్యార్థులు కనీసం అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ఏర్పాటు చేసుకోవాలని కృష్ణారావు సూచించారు.